జిల్లా న్యూస్ లెటర్ పుస్తకావిష్కరణ
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
జిల్లా ఉపాధి కల్పన కార్యలయం నుండి ప్రతి నెల జిల్లా న్యూస్ లెటర్ అనే పుస్తకాన్ని మొదటి సంచికను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళలు , విధ్యార్ధులు, పారిశ్రామిక వేతలు, యువత తమ తమ విజయగాధలను పొందపర్చడం జరుగుతుందని , ఇది యువతకు ప్రోహాత్సకరంగా ఉంటుందని, ఇది అందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఉపాధి కల్పణ అధికారి సాహితి, డి ఎస్ ఓ భరణి, ఐయామ్ ఉదయపూర్ కమల్ దీప్, సంబందిత సిబ్బంది పాల్గొన్నారు.