జీపు, లారీ ఢీ: ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: మక్తల్‌ మండలం టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎం.డి. మౌలాలీ, రఫీ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ మరికల్‌ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మక్తల్‌ నుంచి మౌలాలీ, రఫీ జీపులో మరికల్‌ వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీక్టొడంతో దుర్ఘటన జరిగింది.