జుక్కల్ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే

జుక్కల్, సెప్టెంబర్1,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ని స్థానిక
జెడ్పీటీసీ లక్ష్మీబాయి దాదారావు పాటిల్ స్వగ్రామం చిన్న ఏడ్గి లో గురువారం ఆమె అత్త మాలన్ బాయి అనారోగ్యంతో మృతిచెందడంతో అంత్యక్రియలకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరయి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో
మద్నూర్ AMC ఛైర్మెన్. సాయాగౌడ్ , ఎంపీపీ యశోద నీలు పాటిల్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మాధవ్ రావ్ దేశాయ్ , విండో ఛైర్మన్ శివానంద్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్,
తెరాస నాయకులు మనోజ్ పాటిల్ , పండరి , తెరాస నాయకులు శివాజీ పాటిల్, జానకీ. బాలాజీ, గాజు పటేల్, కాంబ్లే బాలకృష్ణ, ప్రతాప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.