జుక్కల్ లో టిఆర్ఎస్ ధర్నా

జుక్కల్, జూలై20,జనంసాక్షి,
పాలు, బియ్యం పైన కేంద్ర ప్రభుత్వ జిఎస్టీ పెంచినందుకు నిరసనగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్బంగా జుక్కల్ మండల టిఆర్ యెస్ అధ్యక్షులు మాధవ్ రావ్ దేశాయ్ మాట్లాడుతు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ నాగల్ గిద్దె శివానంద్ , నాయకులు నీలుపటెల్, బొల్లి గంగాధర్,కిరణ్ కాంబిలే, రమేష్, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.