జూబ్లీహిల్స్ కల్చరల్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు కె వి నాగేశ్వర్ రావ్ యాదవ్ కు సన్మానం

మేడ్చల్ (జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాల యాదవ జేఏసీ ఆధ్వర్యంలో  ఎల్లావుల  చక్రధర్ యాదవ్  అధ్యక్షతన   కె. వి నాగేశ్వరరావు యాదవ్   ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి గా  పదవి బాధ్యత లు చేపట్టిన సందర్భంగా వారిని  సన్మానించిన   వారిలో తెలంగాణ యాదవ్  అఫీషియల్ &  ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర  అధ్యక్షుడు ఎం బి కృష్ణ యాదవ్ ,  హరి కృష్ణ యాదవ్, ఎం. గోపాల్ యాదవ్, నర్సింహులు యాదవ్ , దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్,  సాయి యాదవ్ , తెలంగాణ యాదవ సంఘాల నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా  మంత్రి  మాట్లాడుతూ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  యాదవ కుల బంధువులకు  నేను మంత్రి అయిన సందర్భంగా  ఇంత పెద్ద ఎత్తున యాదవ ప్రముఖులు  వచ్చి నన్ను సన్మానించినందుకు   ఎప్పటికి రుణపడి ఉంటానని ,   రెండు రాష్ట్రాల  ప్రజలకు  సేవ చేస్తానని  మరీ ముఖ్యంగా  బడుగు బలహీన వర్గాల  పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని  సుఖ సంతోషాలతో ఉండాలని  తెలిపారు . అనంతరం కృష్ణ యాదవ్ మాట్లాడుతూ  రెండు రాష్ట్రాల్లో ఉన్న యాదవ  విద్యార్థులు. నిరుద్యోగులు. ప్రజలు. రాజకీయంగా ఆర్థికంగా ,విద్యాపరంగా ,ఉద్యోగ పరంగా. ముందుకు రావాలని  ఆ కృష్ణ భగవాన్ ఆశీస్సులతో  రాబోయే రోజుల్లో  యాదవులందరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.