జూరాలకు భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో నిటి మట్టం 316 మీటర్లకు చేరింది. దీంతో దిగువ  ప్రాంతాల ప్రజలను అధికారులు  అప్రమత్తం చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నిటిమట్టం 318.6 మీటర్లు ఉంది.