జూరాలకు భారీగా వరద నీరు

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలశాయంలోకి ఇస్‌ఫ్లో 72,470 క్యూసెక్కులుగా ఉండగా .. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 57, 474 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకువిడుదల చేస్తున్నారు. జూరాలలో పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 316.8 మీటర్లగా ఉంది.