జోరందుకున్న బతుకమ్మ పండుగ కానుకలు

బషీరాబాద్ సెప్టెంబర్ 27, (జనం సాక్షి)బషీరాబాద్ మండల పరిధిలో మంగళవారం రోజున మంతట్టి గ్రామంలో బతుకమ్మ వేడుకలు ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ప్రతి ఆడపడుచులకు చిరు కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంతట్టి గ్రామ సర్పంచ్ విభూతి దశరథ్ మరియు బోయిని కృష్ణ కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచు విభూతి దశరథ్ మరియు బోయిని కృష్ణ మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వచ్చిన తర్వాతే ఈ యొక్క పండుగ కు గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు.అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వలన ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎటు చూసినా రోడ్లు మరియు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరశురాం,ఎంపిటిసి శ్రీధర్,పంచాయతీ కార్యదర్శి  శ్రీనాథ్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మబ్బులు పాషా,రేషన్ షాప్ డీలర్ పి.ప్రభాకర్,బుక్ కీపర్ మహేష్ చారి,తదితరులు పాల్గొన్నారు