టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుని పరామర్శించిన జడ్పిటిసి మధుకర్.

మర్పల్లి సెప్టెంబర్ 02 (జనంసాక్షి) మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న జడ్పిటిసి మధుకర్ శుక్ర వారము రోజున రాజు ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చేటట్లు చేస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ డైరెక్టర్ గౌస్, టిఆర్ఎస్ పార్టీ మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గఫార్, నాయకులు కాజా, వసంత్, ఉన్నారు.