*టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ వర్ధంతి*

కోదాడ జులై 6(జనం సాక్షి)
టి ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబు మాదిగ.
బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, అసమానతలు లేని సమాజ నిర్మాణం కొరకు తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని టిఎమ్ఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబు మాదిగ అన్నారు. బుధవారం జగ్జీవన్ రామ్ 35వ వర్ధంతి సందర్భంగా టి ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు కందుల శ్రీను ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.  దేశ ఉప ప్రధానిగా బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అని అన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. అనంతరం వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టి ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు కందుల శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు బచ్చల కూర. నాగరాజు, గంధం పాండు, సిద్ధల రాంబాబు, ఉపేందర్, విజయ్, యేసు, శ్రీకాంత్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు