టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

మునుగోడు జూలై15(జనంసాక్షి):
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడిని బీజేపీ ఓబిసి మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి మాధగొని నరేందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు,సీఎం కేసీఆర్ నియంతృత్వ వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఓర్వలేక అసహనానికిలోనై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటని,ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య అని టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అన్నారు.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు దుబ్బ జెల్లయ్య.మండల ఉపాధ్యక్షులు అక్కెనపల్లి సతీష్.యర్రబెల్లి శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.