టీఎంయూ సభ్యులపై ఎన్‌ఎంయూ దండుదాడి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని వనపర్తి బస్టాండ్‌ వద్ద తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సభ్యులపై ఎన్‌ఎంయూ దండు దాడికి దిగింది. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని వెళ్లగొట్టారు. ఈ ఘటనలో టీఎంయూ కార్యకర్తలకు తీవ్రగాయాలైనట్లు సమాచారం, ఓడిపోతామనే కక్ష్యతోనే ఈ దాడులకు పాల్పడినట్లు టీఎంయూ కార్యకర్తలు ఆరోపించారు.