టీడీపీ మునిగిపోయే పడవ – ఎంపీ బాల్కసుమన్

16వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికలతో పోరుగల్లుగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో నగరం అట్టుడుకుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం వాడి వేడిగా మారింది. ప్రచారం ముగింపు దశలోను టీఆర్ ఎస్, టీడీపీ ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తోంది. టీడీపీ రేపు, మాపో మునిగిపోయే పడవని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీటీడీపీ నేత రేవంత్ ఆ పార్టీలో ఉండడని, చచ్చేంత వరకు పసుపు జెండా కప్పుకుంటానని ఆయన ప్రమాణం చేస్తాడా … అంటూ ఎంపీ సవాల్ చేశారు.