టీ జేఏసీ పిలుపుమేరకు లండన్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లండన్‌, (జనంసాక్షి) :
టీ జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ‘జై భారత్‌’ ఆధ్వర్యంలో లండన్‌లో ఆదివారం రాత్రి అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు చందూగౌడ్‌ చిక్కా, నాయకులు గంప వేణుగోపాల్‌, అనిల్‌ కూర్మాచలం, రంగుల సుధాకర్‌, మనోహర్‌, ప్రమోద్‌, అశోక్‌, మల్లారెడ్డి మాట్లాడారు. చిన్న రాష్ట్రాలు, అంబేద్కర్‌ ఆశయంపై చర్చ నిర్వహించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని, ప్రజల ఆకాంక్షలకు మించి ఇంకా ఎముంటుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో మహేశ్‌, నిక్కిరావు తదితరులు పాల్గొన్నారు.