టెక్‌వేవ్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఖైరతాబాద్ : జూన్ 22 (జనం సాక్షి) 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ గ్లోబల్ ఐటి, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన టెక్‌వేవ్ తన ఉద్యోగుల కోసం వర్చువల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా, యోగా సెషన్‌కు టెక్‌వేవ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజ్ గుమ్మడపు నాయకత్వం వహించారు. టెక్‌వేవ్ చైర్మన్ దామోదర్ రావు గుమ్మడపు శిక్షణ పొందిన శిక్షకులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టెక్ వేవ్ సీఈఓ రాజశేఖర్ గుమ్మడపు మాట్లాడుతూ.. టెక్‌వేవ్‌లో మనస్సు, శరీరం, ఆత్మ యొక్క ఐక్యత ప్రాముఖ్యతను, వ్యక్తులు వారి నిజమైన స్థితిని పొందేందుకు శక్తివంతం చేయడంలో దాని పాత్రను బలంగా విశ్వసిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఆర్ దామోదర్ రావు గుమ్మడపు పాల్గొన్నారు.