టేకులపల్లి లో భారీ వర్షం, పొంగిన వాగులు వంకలు

టేకులపల్లి, జూలై 26( జనం సాక్షి) : టేకులపల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం గంటసేపు భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని ఉన్నటువంటి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు అలుగులు పడి వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.గ్రామాలలో ఇళ్లల్లోకి అక్కడక్కడ భారీగా నీళ్లు చేరాయి. వీధులు వరద ప్రవాహాలతో నిండుకుండలా ఉదృతంగా ప్రవహించాయి. వాగులపై ఉన్న బ్రిడ్జిలపై నుండి వరదలు పొంగడంతో రవాణా అంతరాయం ఏర్పడింది. పత్తి మొక్కజొన్న నువ్వులు తదితర పంటల పొలాలు పంటలు కనపడకుండా వరదలు పొంగిపొరిలాయి. వరి, మిర్చి నారు మడులు నీటిలో మునిగి తీవ్ర నష్టం వాటిల్లాయి. జూలై నెలలో కురిసిన వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.