టేకు కలప పట్టివేత

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబటపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఎద్దుల బండ్లలో తరలిస్తున్న టేకు కలపను గురువారం తెల్లవారుజామున అటవీశాఖ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. ఎనిమిది ఎద్దుల బండ్లలో తరలిస్తున్న రూ.2.5లక్షల విలువైన  కలపను పట్టుకున్నారు. మహదేవ్‌పూర్‌ కలప డిపోకు  తరలించినట్లు ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ డీఎఫ్‌వో జోజి తెలియజేశారు.