డీవీఆర్‌ కళాశాలలో జాకీ హేమంత్‌ సందడి

సంగారెడ్డి (మున్సిపాలిటీ): సంగారెడ్డి మండలం కాశీపూర్‌లోని డీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వేడుకలో రేడియో మిర్చి జాకీ హేమంత్‌ సందడీ చేశారు. కళాశాల విద్యార్థులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులను ఉత్సాహ పరిచారు. రేపటితో కళాశాల ఉత్సవాలు ముగిస్తాయని ప్రిన్సిపాల్‌ రాంప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేడియో మిర్చి మార్కెటింగ్‌ మేనేజర్‌ పూర్ణ, కళాశాల ఉపన్యాసకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.