డీసీఎంను అడ్డగించి రూ.5.50లక్షలు దోపిడీ

బొమ్మరాజుపేట: డీసీఎంలో వస్తున్న వ్యాపారిని అడ్డగించి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5.50లక్షలను దోచుకెళ్లారు. ఏర్పుమళ్ల గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యాపారి మహబూబ్‌నగర్‌లో ధాన్యాన్ని విక్రయించగా వచ్చిన రూ.5.50లక్షలను డీసీఎం వాహనంలో తీసుకొస్తుండగా ఈర్లపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనం పై వచ్చి అడ్డగించారు. డ్రైవరుతో పాటు మరో ఇద్దరి పై కారంపొడి చల్లి వాహనంలో ఉన్న నగదును తీసుకెళ్లారు. బొమ్మరాజుపేట పోలీసులు, వేలిముద్రల నిపుణులు వివరాలు సేకరిస్తున్నారు.