డ్రీమ్‌ వ్యాలీ ఆటా సెలబ్రిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ను నిర్వహించిన ఆటా

ఖైరతాబాద్ : జూలై 05 (జనం సాక్షి)  హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రీమ్‌ వ్యాలీ గ్రూప్‌, ప్రీమియం కమ్యూనిటీలు వూటీ గోల్ఫ్‌ కౌంటీ మరియు హల్దీ గోల్ఫ్‌ కౌంటీలను నిర్వహిస్తుంది. డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్‌ ఇప్పుడు సెలబ్రిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ ను వర్జీనియాలో జరుగుతున్న 17వ ఆటా(అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) కన్వెన్షన్‌, యూత్‌ కాన్ఫరెన్స్‌ వద్ద నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ గోల్ఫర్‌, అతిథి కపిల్‌ దేవ్‌, సద్గురు, సునీల్‌ గవాస్కర్‌, క్రిస్‌గేల్‌, రకుత్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులతో పాటుగా సుప్రసిద్ధ సెలబ్రిటీలు ఆటా సెలబ్రిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు.