తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు

సిఎం కెసిఆర్‌,కెటిఆర్‌పై రేవంత్‌ ట్వీట్‌

హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): రాష్ట్రంలో కేసీఆర్‌, కేటీఆర్‌లకు జనం మధ్య తిరిగే పరిస్థితి లేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. తండ్రి, కొడుకులు ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ పిట్టకు నిన్న మెట్‌పల్లిలో చెరకు రైతులు, నేడు సిరిసిల్లలో వీఆర్‌ఏల సెగ తగిలింది. కేసీఆర్‌కు భద్రాచలంలో వరద బాధితుల నిరసన తెలిసిందే. ఇక తండ్రి కొడుకులు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. బంగారు తెలంగాణ క్షేత్రంలో వాస్తవ పరిస్థితి ఇది. అంటూ మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌ రెడ్డి చురకలు అంటించారు.శుక్రవారం మంత్రి కేటీఆర్‌ సొంత నియోజక వర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కు నిరసన సెగ తగిలింది. సిరిసిల్ల పట్టణంలో నిరసన చేస్తున్న వీఆర్‌వోలు మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ ని అడ్డుకున్నారు.