తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక చీరేస్తా…

-ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ రెండుసార్లు గెలిచిన చరిత్ర నాది

-బండి సంజయ్ నువ్వు ఎంపీగా ఎంత కమిషన్లు తీసుకుంటున్నవ్.

-ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ ధ్వజం

ఖానాపూర్ డిసెంబర్ 08(జనంసాక్షి): బిజెపి నాయకులు తనపై గాని,కెసిఆర్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక చీరేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ ఘాటుగా హెచ్చరించారు. గురువారం ఖానాపూర్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇదే ఖానాపూర్ నియోజకవర్గంలో రాథోడ్ రమేష్ ఆయన భార్య కలిసి 20 సంవత్సరాలు పాలించి అవినీతి చరిత్ర రాసుకున్నారు. మీది ప్రజలను మోసం చేసి జైలుకు వెళ్లిన చరిత్ర మీది అని అందుకే ఖానాపూర్ ప్రజలు బుద్ధి చెప్పి ఇంటివద్ద కూర్చోపెట్టారన్నారు. ఇంకా బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మాజీ ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే గంగాపూర్ వాసులు కష్టలు పడ్డారు, పసుపుల ప్రజలు కష్టలు పడ్డారు.అప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా అని నిలదీశారు. తాను ఒక గిరిజన మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండ ఎంపీ సోయం బాపూరావు తనని నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఎంపీగా పోటీచేసే సమయంలో సొంత ఇల్లు కూడా లేకుండే కానీ ఇప్పుడు కార్లు బంగ్లాలు ఎలా వచ్చాయ్ అని ఎంపీని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో అందరికీ తగిన బుద్ది చెపుతారన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించాలే ముందునుండే నాకు ఇండ్లు ఉన్నాయని ప్రజలకు తెలుసు, నేను ఏంటో మీ అబద్ధపు ప్రచారాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. తను ఏంటో తెలిసి ప్రజలు నాకు రెండు సార్లు అవకాశం ఇచ్చారని ,మూడోసారి కూడా గెలవబోతున్నం అని అన్నారు. మేము నేరుగా ప్రభుత్వ పథకాలను ప్రజలవద్దకే తీసుకొని వెళ్ళిన వ్యక్తి నేను అని నాకు ఒక చరిత్ర ఉందని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.నేను కొత్తగా మీల పుటకుఒక్క వేషాలు వేసుకొని జనాలను మోసం చేసిన వ్యక్తిని కాదు అని జాగ్రత్తగా మాట్లాడాలని దమ్ముంటే కేంద్రం నుండి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ దేశ రాజకీయాల్లో వస్తున్నారు అని బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు అని అన్నారు. బిజెపి నాయకులకు దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తేవాలని కాకమ్మ కబుర్లు వినడానికి ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ ,జెడ్పిటిసి వెంక గౌడ్ ,ఎంపీపీ మోహిద్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, మాజీ జెడ్పిటిసి రాము నాయక్, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి రాజ గంగన్న ,ప్రధాన కార్యదర్శి తూమ్ చరణ్ ,పుప్పాల శంకర్, డిఆర్ బిఎస్ డైరెక్టర్ కొక్కుల ప్రదీప్ నాయకులు,తెరాసా పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.