తల్లిదండ్రుల మృతితో అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు

ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి సిద్ధాల దేవయ్య

బోయిన్ పల్లి సెప్టెంబర్ 26 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం దుండ్ర పల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు ఎడెల్లి మల్లేశం కరోనాతో గత సంవత్సరం చనిపోయారు. ఆదివారం రోజున మల్లేశం సతీమణి ఎడెల్లి సత్య 43 సంవత్సరాలు గుండెపోటుతో ఆసుపత్రిలో చనిపోవడం తో వారి పిల్లలు సంగీత (20) అవినాష్ (17) లు అనాధలు అయ్యారు విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య వారిని పరామర్శించి 5000 రూపాయలు అర్తికసహయం చేసి ఓదార్చారు అలాగే బిజెపి నాయకులు ఏనుగుల కనకయ్య 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేసారు. ఈ కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి స్థానిక మాజీ సర్పంచ్ చెక్క బండి భూమిరెడ్డి బిజెపి నాయకులు ఏనుగుల కనకయ్య గోగురి హనుమంత రెడ్డి కందుల భూమ్ రెడ్డి చెక్కబండి సుధాకర్ రెడ్డి, బీజేవైఎం మండల కార్యదర్శి కళ్యాణం అనిల్ ఉప సర్పంచ్ వంగ రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు