తహసీల్దారు కార్యాలయంలో కలెక్టర్‌ తనిఖీ

రంగారెడ్డి,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
: బషీరాబాద్‌ మండలంలోని తహసీల్దారు కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌  రఘునందనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది పనితీరు, ఫైళ్ల పరిస్కారం తదితర విసయాలను ఆరాతీసారు. ఆఫీసులో  కలియ తిరిగి సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. ప్రతి రోజు కార్యాలయానికి సమయానుకూలంగా సిబ్బంది వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు గదులు శిథిలావస్ధలో ఉండడంతో దస్త్రాల నిర్వహణ కష్టంగా ఉందని కలెక్టరు దృష్టికి అధికారుల తీసుకెళ్లారు. అనంతరం ఆయన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు.