తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వర్షాలు, వరదల తాజా పరిస్థితుల పై జనగామ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, అంటు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జనగామ కలెక్టరేట్ లో సంబధిత జిల్లా అధికారులతో శనివారం సమీక్షించారు. జిల్లాలో 14.29 సె. మీ. వర్షపాతం నమోదు అయిందన్నారు.

ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ వానాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు గుర్తించి ప్రజలను అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పంపాలన్నారు. పునరావాస చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షాల తర్వాత అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు.

ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి అని జిల్లా కలెక్టర్ శివ లింగయ్య ను మంత్రి అదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని త్రాగునీరు సరఫరా పారిశుధ్యం నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు, zp సీఈఓ, డీపీ ఓ, డీఎం అండ్ హెచ్ ఓ, drdo, police అధికారులు పాల్గొన్నారు.