తెరాస పార్టీ నాయకులు కెషీయ్య నాయక్ పార్థివ దేహానికి పూలమాల వేసిఎమ్మెల్యే

మల్దకల్ సెప్టెంబర్ 11(జనం సాక్షి)గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని మద్దెలబండ చిన్న తండా గ్రామానికి చెందిన తెరాస పార్టీ నాయకులు కెషీయ్య నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్న మరణించారు.ఆదివారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి స్వగృహానికి వెళ్లి ఆయన పార్థివదేహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
ఎమ్మెల్యే వెంట గట్టు ఎంపీపీ విజయ్, మల్డకల్ వైస్ ఎంపీపీ వీరన్న, తెరాస పార్టీ నాయకులు నారాయణ, అంగడి బస్వరాజ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.