తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్ రెన్స్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 జనంసాక్షి;
తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్ రెన్స్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కామారెడ్డి నియోజక వర్గ తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్ రెన్స్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. మందాపూర్ గ్రామానికి చెందిన చెన్నం రాజా సింహ రెడ్డి మృతి చెందగా నామిని సుజాతకు 2 లక్షల రూపాయలు, టేక్రీయాల్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త రాజు మృతి చెందగా నామిని ఒడ్డెం లక్ష్మీకి , ఉప్పర్ పల్లికి చెందిన టంకరి వెంకట్ మృతి చెందగా టంకరీ సత్తామ్మకు,జనగామకు చెందిన పాత సిద్ధిరాములు మృతి చెందగా నామిని సతవ్వ కు, గొల్లపల్లి ప్రసాద్ మృతి చెందగా నామిని లావణ్య కు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విప్ గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కార్యకర్తలను అన్ని రకాల ఆదుకుంటున్నారని అన్నారు. తెరాస పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కులను ఐదుగురికి 10 లక్షలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి. ఎంపీపీలు ఆంజనేయులు, బాలమణి, పంచముఖి హనుమాన్ అధికార ప్రతినిధి బలవంతరావు. తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.