తెరాస మండల అధ్యక్షుడు చేతుల మీదగా సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ.

-ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం.
-తెరాస పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ.

మంగపేట,జూలై 26(జనంసాక్షి):-

తెరాస ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన,యం.శ్రీను కు ( 60 వేల రూపాయలు) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అలాగే కత్తిగుడెం గ్రామానికి చెందిన యస్.ముత్యాలరావు కు (36,500వేల ఐదువందల రూపాయలు) చెక్కును, అక్కినపల్లి మల్లారం గ్రామానికి చెందిన డి.సాంబశివరావు కు (30,000 వేల రూపాయలు)కుడుముల లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రదాయనిగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది అని అన్నారు.
ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంగపేట మండల తెరాస పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజుయాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్, జీవ వైద్య వైవిద్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు, మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి,మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, రాజమల్ల సుకుమార్, రవణక్క పేట గ్రామ కమిటీ అధ్యక్షుకు, బట్ట సందీప్, కత్తిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు రోడ్డ సుదర్శన్, అక్కినపల్లి మల్లారం గ్రామ కమిటీ అధ్యక్షుడు రూపభద్రయ్య, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, తిమ్మంపేట గ్రామ ఎగ్గడి అర్జున్ , తెరాస పార్టీ శ్రేణులు దోసిల్ల సునీల్,బిలపటి ప్రవీణ్ కుమార్ , కోoబత్తిని వాసు,బిలపాటి రాజు చేటుపల్లి నీరజ్ ,మండల సోషల్ ఇన్చార్జి గుడివాడ శ్రీహరి, తదితరుల పాల్గొన్నారు