తెలంగాణపై బిజెపికి కడుపునిండా విషమే
ఎనిమిదేళ్ల తరవాత మోడీ మళ్లీ విషం కక్కారు
ఆనాడు తల్లిని చంపి బిడ్డను కాపాడరని వ్యాఖ్య
వలసకూలీలపైనా మోడీ విషం కక్కారు
తెలంగాణ ద్రోహి బిజెపిని నిలదీయాల్సిందే
హన్మకొండలో మంత్రి హరీష్ రావు మండిపాటు
వరంగల్,ఫిబ్రవరి10(జనంసాక్షి): ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని..దీనిని ప్రజలంతా ముక్తతకంఠంతో ఖండిరచాలని మంత్రి హరీస్ రావు అన్నారు. తెలంగాణ అమరులను మోదీ కించపర్చారన్నారు. తెలంగాణ త్యాగాలను, ఆకాంక్షను చిన్నగా చేసి చూస్తున్నారని మంత్రి అన్నారు. ఆరోజు తల్లిని చంపి బిడ్డను బతికించారని కామెంట్స్ చేశారని… మోదీ, బీజేపీ నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ చట్టాల విషయంలో మూజువాణి ఓటుతో ఎలా బిల్ పాస్ చేశారని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన
వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపినా కలుపుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా విభజన హావిూలను పరష్కరించకుండా తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ విషం చిమ్ముతున్నారని హరీశ్ రావు మండి పడ్డారు. గురువారం హన్మకొండలో టి డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడంతో పాటు, మథర్ మిల్క్ బ్యాంక్, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎంజీఎం ఆసుపత్రిలో 42 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై విషం కక్కిన మోడీ.. ఇప్పుడు వలస జీవులపై విషం కాక్కడు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు. నేడు తెలంగాణ ఉద్యమ కారుల బలిదానాలను కించపరిచారు. తెలంగాణ ఏర్పాటును తక్కువ చేయడం అంటే? అమరులకు కించపరచడం..ఉద్యమాన్ని కించపరచడమే. వరంగల్ లోనే ఎంత మంది బలిదానాలు చూసాము..ఎన్ని త్యాగాలు..ఎన్ని శవాలు మోసాము. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదని అంటున్నారు. తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోడీ పని. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజీ ఇస్తే ఎందుకు ఒక్కటి ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటి ఇవ్వలేదు. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపారు. అందరూ వ్యతిరేకిస్తున్న కూడా వ్యవసాయ చట్టాలు ఎలా చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కరోనా సమయంలో ఎంతో మంది వలస జీవులు బతికి ఉంటే చాలు అనుకుంటే.. మోడీ వారిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. వలస కార్మికులకు సమయం ఇవ్వలేదు. అకస్మాత్తుగా లాక్ డౌన్ పెట్టారు. ఎంతో మంది నరకం చూసారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం పెట్టి, జేబులో డబ్బులు పెట్టీ, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపారు. ఇలా వలస కార్మికులకు అనేక మంది, సేవా సంస్థలు సహకారం అందించాయి. అందరినీ అభినందిచల్సినది పోయి.. మోడీ విమర్శలు చేస్తున్నారు. వారిని ఇంటికి పంపడం వల్లనే కరోనా పెరిగింది అని అవమాన పరిచారు. వలస జీవులపై ఎందుకు మోడీకి చిన్న చూపు. వలస కార్మికుల కష్టాలు అర్థం చేసుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయ్యింది. విూరు ట్రంపును తీసుకు వచ్చి, విూటింగ్ లు పెడితే, ఎన్నికల ర్యాలీలు పెడితే కరోనా పెరగలేదు కానీ వలస కార్మికుల వల్ల పెరిగిందా. ఇంత కంటే దారుణం ఇంకొకటి ఉంటదా. పొట్ట చేత పట్టుకొని ఉన్న వారిపై నిందలు వేయడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంటే భారతీయ జనతా పార్టీకి కడుపు నిండా విషం ఉంటుందన్నారు. బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినయి అని పేర్కొన్నారు. నిధులు ఇవ్వకుండా సూటిపోటి మాటలు మాట్లాడటం సరికాద న్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం పురోగతిలో ఉంటుంది.. అభివృద్ధి ఆగదు అని హరీశ్రావు తేల్చిచెప్పారు. ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిలో టాప్ 10లో దేశంలో 7 తెలంగాణ గ్రామాలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కేంద్రం నుండి అనేక అవార్డులు వచ్చాయి. ఇది మా పని తీరు.. కళ్లకు కనిపిస్తలేదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. మోదీ ఇంకో మాట అంటారు.. రాష్టాల్రు, కేంద్రం కలిసి ఉండాలని.. నీతులు బాగానే చెబుతాడు. కానీ చేతల్లో మాత్రం చూపించరు అని విమర్శించారు.
ఎందుకు మా ఏడు మండలాలు ఆదరాబాదరాగా ఆంధ్రాలో కలిపారు. ఎందుకు సీలేరు ప్రాజెక్టు అప్పగించారు. నువు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా? అని హరీశ్రావు నిలదీశారు. మోదీ వ్యాఖ్యలను జర్నలిస్టు సంఘాలు కూడా తీవ్రంగా ఖండిరచాలి. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జర్నలిస్టులు కీలక
పాత్ర పోషించారు అని హరీశ్రావు గుర్తు చేశారు. మళ్లీ వారు ఇప్పుడు కూడా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.