తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, 31.21 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం మంది క్వాలిఫై అయ్యారు. గత టెట్ పరీక్షతో పోలిస్తే పాస్ పర్సంటేజీ ఈసారి తగ్గింది. బుధవారం సెక్రటేరియేట్లో విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహా రెడ్డి తదితరులు టెట్ ఫలితాలను విడుదల చేశారు. టీజీ టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ఈ ఎగ్జామ్స్కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,35,802 మంది మాత్రమే పరీక్షలు రాశారు. వీరిలో 83,711 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఫలితాలను www.schooledu.telangana.gov.inలో అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టెట్ కన్వీనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.