తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్న మోడీ


ధాన్యం కొనమని చెప్పడం దారుణం
కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల ధర్నాలో సబిత
రంగారెడ్డి,డిసెంబర్‌20(జనం సాక్షి ): మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించడం ద్వారా తెలంగాణ రైతులను నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని ఆకుల మైలారం గ్రామంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రైతుల విూద కక్ష కట్టిన కేంద్రం ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసి నష్టపోకుండా ఉండాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మరో 30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం రైతుల వద్ద ఉందని, కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తీసుకుంది నామమాత్రమేనని తెలియజేశారు. బిజెపి నేతలు ఢల్లీిలో ఒక లాగా, గల్లీలో మరోలాగా మాట్లాడుతున్నారని, తెలంగాణ రైతుల కోసం పూర్తి ధాన్యం కొనుగోలు చేసేలా ముందు కేంద్రాన్ని ఒప్పించాలని, లేదంటే బిజెపికి తెలంగాణ లో స్థానం లేకుండా తెలంగాణ ప్రజలు, రైతులు చేస్తారని సబితా హెచ్చరించారు. రైతులకు అండగా దేశ చరిత్రలో ధర్నా చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు మాత్రమేనని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్నారు. ఇప్పటికే మొదటి పంటకు ఇబ్బంది పెడుతూ, రెండవ పంట కొనమని అంటున్న బిజెపి ప్రభుత్వ వైఖరిని ఖండిరచారు. మోడీ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసేవరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ లో రైతన్నకు పంట పెట్టుబడి సహాయంగా ఎకరాకు 10 వేలు ఇస్తుందని, ఏటా 14 వేల కోట్లు రైతు బంధు నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం కెసిఆర్‌ ప్రభుత్వం అని కొనియాడారు. ఇప్పటి వరకు 50 వేల కోట్లు రైతులకు రైతు బంధు ద్వారా అందజేయడం జరిగిందన్నారు. పంట సహాయంపై రైతు కు భరోసాతో పాటు, 24 గంటల ఉచిత విద్యుత్‌, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తూ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పిడి యాక్ట్‌ నమోదు చేసి, పంట కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అండగా ఉంటామన్నారు. అందువల్లనే నేడు తెలంగాణ లో సాగు విస్తీర్ణం పెరిగిందని, తెలంగాణ రాకముందు గతంలో 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేడు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం పండిరదన్నారు. రాష్ట్రంలో గతంలో కోటి 40లక్షల మెట్రిక్‌ టన్నుల పండితే,
నేడు రెండు కోట్ల 3లక్ష ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిరదని సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. రైతుకు ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారం మాత్రమే అని గుర్తు చేశారు.