తెలంగాణ సాయుధ పోరాట యోధులను కించపరిచరిచిన బీజేపీ నేత బహిరంగంగ క్షమాపణ చెప్పాలి

కోటగిరి సెప్టెంబర్ 16 జనం సాక్షి:-తెలంగాణ పోరాట యోధులను అవమానిస్తూ,వారి పోరాటాలను అవహేళన చేస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర సెక్రెటరీ ప్రకాష్ రెడ్డి వెంటనే బహిరంగంగ క్షమాపణ చెప్పాలని కోటగిరి మండల రజక సంఘ సభ్యులు డిమాండ్ చేశారు.శుక్రవారం రోజు కోటగిరి మండల కేంద్రంలో మండల రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో బీజేపీ నేత మాట్లాడిన తీరుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ప్యాట్ల పెంటయ్య మాట్లాడుతూ నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తి దాయకమైన చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య లాంటి వీరుల పోరాటాలను వెకిలి మాటలతో కించపరుస్తు మాట్లాడటం దుర దృష్టకరమని అన్నారు.బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి మాట్లాడిన మాటలను బేషరతుగా వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలనీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘం ఆధ్వైర్యంలో దీక్షలు, ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీనివాస్,ఉపాధ్యక్షులు మేత్రిశివలాల్,శ్రీనివాస్,కాశామణి,బాలయ్య,సంఘం సభ్యులు పాల్గొన్నారు.