త్రీదలన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.

డిఎస్పి మోహన్ కుమార్ లంబోదరునికి ప్రత్యేక పూజలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 7 (జనంసాక్షి):
వినాయక చతుర్థి సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన లంబోదర విగ్రహాలకు ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.సంత బజారుకు వెళ్లే హాకీం వీధిలో త్రీదలన్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విగ్రహం మండపంలో కాలనీవాసులు ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తూ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు మంగళవారం సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాలలో డిఎస్పి మోహన్ కుమార్ పూజలు నిర్వహించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కాలనీలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించ డంతో పాటు వినాయక విగ్రహానికి ప్రతిరోజు వివిధ రూపాలలో అలంకరించడం జరుగు తుందని తెలిపారు.ఈ పూజా కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్టు హకీం కిషోర్, యూత్ సభ్యులు ప్రవీణ్,నిఖిల్ సాయి, చంద్రకాంత్,రాకేష్, మణి, తేజ, విజయ, సాయి, భరత్, సురేష్, చందు, బిట్టు, మధు, నంబి, అసిమ్, రాఘవేంద్ర, చరణ్, నాని, ఈశ్వర్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.