త్వరలోనే ఉపాధ్యాయుల పదోన్నతులు , బదిలీలు

జనగామ (జనం సాక్షి) జూలై9:పి ఆర్ టి ఎస్ టి ఎస్ జనగామ జిల్లా శాఖ అద్వర్యంలో స్థానిక ఎన్ ఎమ్ ఆర్ గార్డెన్స్ లో పదవ తరగతిలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు ,100శాతం ఉత్తీర్ణత పొందిన పాఠశాలలకు ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది .జిల్లా శాఖ అధ్యక్షులు కొల్ల మహిపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎమ్ ఎల్ సి కాటేపల్లి జనార్ధనరెడ్డి పాల్గొని అభినందనలు తెలియజేశారు …ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ 317 జి ఓ ద్వారా బదిలీ జరిగిన ఉపాధ్యాయులకు పరస్పర బదిలీ ప్రక్రియ ముగిసిన వెంటనే ఉపాధ్యాయులందరికీ యాజమాన్యాల వారిగా పదోన్నతులు బదిలీల షెడ్యూల్ విడుదల అవుతుందని తెలియజేశారు ..
అతిధులు మాజీ ఎమ్ ఎల్ సి పుాల రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వాదించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ బీరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడమే కాక విద్యార్థులను కుాడా ప్రోత్సహించే కార్యక్రమాలను చేపడుతున్న జిల్లా శాఖను అభినందించారు.ఈ కార్యక్రమం