దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, నవంబర్ 18, (జనంసాక్షి )
దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు పథకం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి మండలం బూద ఖుర్డు గ్రామానికి చెందిన నారాయణకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన టెంట్ హౌస్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాదించాలని, దళితులు ఆత్మ గౌరవంగా బతికేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు. టీఆరెఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందనడానికి దళిత బంధు పథకం నిదర్శనం అన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి సురేష్, సర్పంచ్ కృష్ణమూర్తి, నాయకులు మల్లేష్, రవి, శ్రీనివాస్, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.