దళిత బందు మీకంటే మీకే అంటూ 15 మందినీ నమ్మబుచ్చిన గ్రామ సర్పంచ్ …

డప్పు చప్పుళ్ళతో గ్రామాల్లో నిరుపేద దళితులు నిరసన..
దలితబందు పేరు తో దోచుకుంటున్న నాయకులు….
వెంకటాపూర్ (రామప్ప)అక్టోబర్01(జనం సాక్షి):-
వెంకటాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో దళిత బంధువుతో గ్రామాల్లోని దళితుల దగ్గర  దళిత బంధు ఇప్పిస్తానని గ్రామానికి 15 వస్తాయని నమ్మబలికి గ్రామాల్లోనే కొందరు టిఆర్ఎస్  కార్యకర్తలు దళితుల దగ్గర చేతికి అందినంత దోచుకుంటున్నారు. మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న దళిత నిరుపేద కుటుంబాలకు చెందిన వారు టిఆర్ఎస్ అధికారులను నిలదీయగా మాకు నచ్చింది చేస్తున్నాము దిక్కున్న చోట చెప్పుకో మన్నట్లు సమాధానం చెప్పారని  ఒక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బీరెల్లి సమ్మయ్య నిరుపేద దళితులను వెంట వేసుకొని డప్పుల చెప్పులతో గ్రామంలోని వాడవాడలా తిరుగుతూ నినాదాలు చేస్తూ ఆవేదన వెలిబుచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామంలో నిరుపేద దళితులు పాల్గొన్నారు.