దళిత సర్పంచును దూషించారని ఫిర్యాదు

జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, దళిత సామాజిక వర్గానికి చెందిన చిన్నయ్యను అదే గ్రామానికి చెందిన కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్ గురువారం అసభ్య పదజాలంతో దూషించారని మాల మహానాడు నాయకులు శుక్రవారం వంగూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు దొడ్డి విష్ణు మాట్లాడుతూ, మాల సామాజిక వర్గానికి చెందిన వృద్ధుడైన దళిత సర్పంచ్ చిన్నయ్యను అంకు సురేందర్ అసభ్య పదజాలంతో తిట్టాడని అన్నారు. చిన్నయ్యను తిట్టిన అంకు సురేందర్ పై కేసు నమోదు చేయాలని, కేసు నమోదు చేయకపోతే జాతీయ స్థాయిలో పోరాడుతామని అన్నారు. సర్పంచ్ చిన్నయ్య మాట్లాడుతూ తనను అంకు సురేందర్ ఆ కారణంగా తిట్టాడని ఆరోపించారు. గ్రామంలో భారీ వర్షాల కారణంగా వరదలు వస్తే పట్టించుకోవడంలేదని ఫోన్ చేసి, బహిరంగంగా బజార్ లో దూషించాడని ఆరోపించారు. అంకు సురేందర్ తనను దళిత సర్పంచ్ అని వేధిస్తున్నాడని అన్నారు.