దుబ్బతండా వాసులు

చండ్రుగొండ  జనంసాక్షి (జులై 24) : మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన  గిరిజనులు  తమ భూ సమస్యలను తీర్చాలని, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూమికి  పట్టా  పాసుపుస్తకాలు ఇప్పించాలని కోరుతూ తాటి సుబ్బన్న గూడెం లోని  నివాస గృహంలో   ఎమ్మెల్యే   మెచ్చా నాగేశ్వర్రావు ను ఆదివారం  కలిశారు.  వినతి పత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని  సమస్య పరిష్కారానికి  కృషి చేస్తానన్నారు. ఆయన్ను కలిసిన వారిలో  తేజావత్ రవి,సేవ్యా ,రమేష్   కిషన్ తదితరులు ఉన్నారు.
Attachments area