దోమల నిర్మూలనపై అవాగాహన కార్యక్రమం

కాప్రా : సర్కిల్‌ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధ్వర్యంలో దోమల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కళాకారుల బృందంతోఅటపాటల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యాక్రమాన్ని చేపట్టారు. చర్లపల్లి చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్‌ ప్రజా అరోగ్య అధికారి కవిత, కార్పోరేటర్‌ ధన్‌పాల్‌రెడ్డి, ఎంటమాలజీ అధికారి నామాల శ్రీనివాస్‌, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గోన్నారు.