ధర్మారం మండలం మల్లాపూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర

ధర్మపురి (జనం సాక్షి)ధర్మారం మండలం మల్లాపూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్రకు ఊరు ఊరు తరలి వచ్చింది. చిన్నా పెద్ద అంటూ తేడా లేకుండా యాత్రలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట అడుగులో అడుగు వేస్తూ నడిచారు. దారిపోడవునా బతుకమ్మలు, మంగళ హరతులతో స్వాగతం పలికారు.మల్లాపూర్ గ్రామంలో ఒకప్పుడు సౌకర్యాలు లేక ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మౌలిక వసతులు సమాకురాయన్నారు. అన్నీ కులాలు వర్గాల అభ్యున్నతికే కేసీఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. గతంలో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. గడిచిన తొమ్మిది ఏళ్ల కాలంలో అన్నీ వసతులు సమాకుర్చుకున్నామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలే రానున్న ఎన్నికల్లో విజయాన్ని చేకూర్చి పెడుతాయాన్ని ఆశా భావం వ్యక్తం చేశారు. ఇందుకు గ్రామస్తులు అంతా సంఘటీతం కావాలని పిలుపు నిచ్చారు.
ఈ యాత్రలో ఎంపిపి ముత్యాల కరుణశ్రీ, జెడ్పిటిసి పుస్కూరి పద్మజ, సర్పంచ్ గంధం వరలక్ష్మి నారాయణ, గడ్డం శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, సరితా రాజు నాయక్,గుర్రం తిరుపతి గౌడ్, వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డి, నిమ్మ రాజయ్య, కొండా సులోచన, దాసరి మహేష్, నేరెళ్ల కవిత, తదితరులు పాల్గొన్నారు.