నకిరేకల్‌లో వస్త్రవ్యాపారుల నిరసన

నకిరేకల్‌: వస్త్రాలపై వ్యాట్‌ అమలుకు నిరసనగా నకిరేకల్‌ పట్టణంలో మంగళవారం నాలుగో రోజు వస్త్ర దుకాణాల బంద్‌ కొనసాగింది. వ్యాపారులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణ ప్రధాన కూడలిలోని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు సంఘం జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్‌, నకిరేకల్‌ అధ్యక్షుడు అంజనేయులు పాల్గొన్నారు.