నరేంద్ర మోడీకి చిత్రపటానికి పాలాభిషేకం

బోయిన్ పల్లి అక్టోబర్ 18 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బోయిన్ పెళ్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కిసాన్ సమ్మన్ నిధి యోజన ద్వారా భారతదేశంలో ఉన్న రైతులందరికీ 2000 రూపాయలు వారి వారి అకౌంట్లో జమ చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్న రైతుల కోసం 16 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అని రైతు సంక్షేమం కోసం రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర పెంచడం జరిగింది అదేవిధంగా ఎరువులకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని రైతులు వేసిన పంటలు నష్టపోయినప్పుడు ఫసల్ బీమా యోజన ద్వారా నష్టపరిహారం అందించడం జరుగుతుందని కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని నరేంద్ర మోడీ ప్రభుత్వము రైతు ప్రభుత్వమని గుడి రవీందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి చొప్పదండి నియోజకవర్గ జెయింట్ కన్వీనర్ ఉదారి నరసింహ చారి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఐల మహేష్ కృష్ణ, బిజెపి మండల ఉపాధ్యక్షులు సుంకపాక ప్రభు, సారంపల్లి రాజు, మండల కార్యవర్గ సభ్యులు బొటుకు తిరుపతి , కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మారంపల్లి భూమిరెడ్డి ,బోయిన్ పెళ్లి గ్రామ అధ్యక్షులు బోగోజి గంగాధర్ చారి, బిజెపి నాయకులు రాజూరి కిరణ్ ,డబ్బు తిరుపతి రెడ్డి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కొనుకటి హరీష్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు లింగంపల్లి అనిల్ , అనిల్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు