నల్లగొండలో విస్తారంగా వర్షాలు

గోడకూలిన ఘటనలో తల్లీపిల్లలకు గాయాలు

నల్లగొండ,జూలై9(జనంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ మండలం కాంచనపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఇంటి గోడ కూలిపోయింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై ఇటుకలు పడ్డాయి. ఈ ప్రమాదంలో యాదమ్మతో పాటు తన ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. యాదమ్మ భర్త నరసింహకు
స్వల్ప గాయాలయ్యాయి. తల్లీ, పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.