నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి ఎంపీడీవో

ముస్తాబాద్ ఆగస్టు 2 జనం సాక్షి
వనమహోత్సవంలో భాగంగా నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలనీ ఎంపీడీవో ఎం రమాదేవి అన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి రామక్షంపల్లే ముస్తాబాద్ వివిధ గ్రామాలలో వనమహోత్సవం కార్యక్రమం పండుగ వాతావరణం లో నిర్వహించారు
స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి ఎం రమాదేవి మాట్లాడుతూ.స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో భాగంగ,వనమహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ రోజు , గ్రామాల్లో అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో  మొక్కలు నటుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు ఈ వనం మహోత్సవములో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కాశోల పద్మ దుర్గ ప్రసాద్. రామకృష్ణ పల్లి సర్పంచి దమ్మ రవీందర్ రెడ్డి అంగన్వాడి టీచర్ ఉప సర్పంచ్ పాలకవర్గం అంకని రంజిత్ రోడ్డ దేవదాస్ పంచరి కార్యదర్శి గ్రామస్తులు పాల్గొన్నారు