నార్సింగ్ ఓఆర్ ఆర్ పై కారు బోల్తా: ఒకరి మృతి

రంగారెడ్డి: నార్సింగ్ ఔటర్ రింగ్‌రోడ్డుపై అదుపు తప్పి వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై పడిన విద్యార్థుల పైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. బాధితులు సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.