నిరుపేద కుటుంబానికి రెండు లక్షల యబ్భై వేల రూపాయల ఎల్ ఓ సి అందజేత

మద్దూరు (జనంసాక్షి) జూలై 22: జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం గాగిల్లపూర్ గ్రామానికి చెందిన  క్రి. శే.బండి మల్లయ్య గౌడ్ గారి కుమార్తె సులోచన గారు గత  కొన్ని రోజుల నుండి  ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా వారి కుటుంబం పేద కుటుంబం కావడంతో  వారి బంధువులు టీఅర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ గారిని సంప్రదించి విషయం తెలుపగ వెంటనే స్పందించిన కిరణ్ కుమార్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన మంత్రి వెంటనే రెండు లక్షల యబ్భై వేల రూపాయల పత్రాన్ని మంజూరు చెయ్యడం జరిగింది. ఆ పత్రాన్ని ని హాస్పిటల్ కి తీసుకెళ్లి వారి బంధువులకు అందజేశారు.ఈ సందర్భంగా సులోచన బంధువులు సీఎం కేసీఆర్ గారికి,రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారికి,టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.