నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

చేగుంట : మెదక్‌ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామంతపూర్‌ వద్ద వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నీటి తొట్టెలో పడి సిరి (3) అనే చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు బుజ్జి, గణేష్‌లు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా చిన్నారి ఆడుకుంటూ పక్కనే నీటి తొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయింది. తల్లిదండ్రులు గమనించకపోవడంతో ఊపిరాడక మరణించింది. చిన్నారి శవాన్ని నీటితొట్టెలో చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

తాజావార్తలు