నీటి గుంతలో పడి వ్యక్తి మృతి.

పంచనామా నిర్వహిస్తున్న ఎస్సై రాజశేఖర్.
నెన్నెల, అక్టోబర్ 12, (జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలో బుధవారం నీటి గుంతలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందాడని నెన్నెల ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జంబోజు రమాదేవి భర్త అయిన జంబోజు నగేష్ గత కొంత కాలంగా అతిగా మద్యానికి బానిసై మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయడని, గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి ఊపిరి ఆడక చనిపోయి ఉంటాడని మృతుని భార్య రమాదేవి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.