నీళ్ల బకెట్‌లో పడి బాలుని మృతి

నల్గొండ జిల్లా: నీళ్ల బకెట్ లో పడి చిన్నారి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రాపోలులో ఆదివారం చోటుచేసుకుంది. కొండ్రాపోలు బాండవ తండాకు చెందిన హుసేన్,సునీత దంపతుల 11 నెలల కుమారుడు ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి మృతిచెందాడు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న బకెట్‌లో పడిపోయాడు. చిన్నారి మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.