నూతన ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ స్థలం ఎంపిక

ఎల్లారెడ్డి 30 ఆగస్ట్ జనంసాక్షి (టౌన్)
 ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేట్ మార్కెట్ స్థల ఎంపిక పూర్తి కావడంతో మంగళవారం నాడు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణకు ఆ శాఖ కు సంబంధించిన అధికారులు నూతనంగా నిర్మించబోయే భవనం ప్రతిమ మ్యాప్ ను చూపించారు. పట్టణంలోని ఇరిగేషన్ శాఖ మరియు అటవీ శాఖ భవనాలను మంగళవారం నుండి కూల్చివేస్తారని ఇ ఇ మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో 2 కోట్ల రూపాయలతో నూతన మార్కెట్ కూరగాయలు మరియు మటన్ మాంస దుకాణలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎల్లారెడ్డి ప్రాంత వాసులకి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీవన్,ఏఇ వినోద్ కుమార్,కౌన్సిలర్ భూంగారి రాములు, ఎల్లారెడ్డి టిఆర్ఎస్ అధికార ప్రతినిధి రామప్ప, టిఆర్ఎస్ నాయకులు శివకుమార్, రాజు, అరవింద్ గౌడ్,వెల్లుట్ల సాయిలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.